Monday, April 29, 2024

కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న మోడీ సర్కార్

- Advertisement -
- Advertisement -

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేట్ వ్యక్తుల చేతులల్లో పెట్టి ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం
కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి కుట్రలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్, వరంగల్:  కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న మోడీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దుయ్యబట్టారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ ప్రజా గ్రంథాలయం పక్కన తాళాలు వేసి నిరుపయోగంగా ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌ను సందర్శించి దాని దుస్థితిని చూసిన చలించిపోయారు. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన పూర్వ పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేలు జాతీయ రహదారులు పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు టెలికమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పినట్లు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం గత 75 సంవత్సరాలుగా ఆయా రంగాలు సేవలు అందించాయి కానీ ఇప్పుడు 75 సంవత్సరాల స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేసి వాటి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తోందన్నారు. అందుకు ములకనూరు గ్రామంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో టవర్‌పై కూడా చెట్లు మొలిచి ప్రభుత్వ ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయని, ఇది కేవలం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా పాలన వ్యతిరేక విధానాలతోనే జరిగిందని కార్పొరేట్ల ఆదానీలకు,అంబానీలకు మేలు చేయడం కోసమే వారు పనిచేస్తున్నారని విమర్శించారు.

ఒకప్పుడు టెలిఫోన్ టవర్ల ద్వారా ఇంటింటికి టెలిఫోన్ కనెక్షన్లు ఉండి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి మోడీ ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో లక్షల టవర్లు బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులు నిరుపయోగంగా మారాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్ , ఎయిర్ ఇండియా, రైల్వే, భారత్ పెట్రోలియం,షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, పోర్టులు,నేషనల్ హైవేలు వంటి ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహి అనే ముద్ర వేసి సిబిఐ, ఈడీ, ఆదాయపన్నుల పేరుతో బెదిరింపులు, దాడులు.దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని ద్వజమెత్తారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేస్తు పబ్బం గడుపుతున్న బిజెపికి త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ప్రజలే వారికి గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్, స్దానిక నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News