Sunday, April 28, 2024

సింహబలంతో కొత్త పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

Modi unveiled statue of country's national symbol

9500 కిలోల జాతీయ చిహ్నాం
ప్రధాని మోడీ ఆవిష్కరణ
స్పీకర్‌తో కలిసి ఆవరణలో పూజలు

న్యూఢిల్లీ : నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంట్ భవనంపై దేశ జాతీయ చిహ్నం ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. గంభీరంగా ఉన్న నాలుగుసింహాల అశోకస్థూపం కొత్తపార్లమెంట్‌కు తలమానికంగా ఉంటుంది. 6.5 మీటర్ల ఎత్తుతో , 9500 కిలోల బరువుతో ఉండే ఈ కాంస్య ప్రతిమ ఈ ఏడాది చివరిలో ఆరంభం అయ్యే పార్లమెంట్ భవన సంపూర్తి దిశలో కీలక మైలురాయి అయింది. ఇంతటిబరువు మోసే విధంగా పార్లమెంట్ హాల్‌పై భాగంలో పెద్ద భారీ ఉక్కు వేదికను ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్, ఉన్నతాధికారులు వెంటరాగా ప్రధాని మోడీ ఈ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోడీ కొద్ది సేపు అక్కడున్న భవన నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లు ఇతర నిపుణులతో ఇష్టాగొష్టిగా మాట్లాడారు. పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో పాలుపంచుకోవడం అపూర్వ విషయం అని ప్రధాని వారిని అభినందించారు.

దేశ ప్రజాస్వామిక సౌథం సమున్నత రీతిలో ఉండేలా తీర్చిదిద్దేందుకు పాటుపడే వారి గొప్పతనం ఎనలేనిదని కొనియాడారు. పార్లమెంట్ నిర్మాణ పనులలోని శ్రమజీవులతో తన ముచ్చట తనకు ఆనందం కల్గించిందని ప్రధాని తెలిపారు. ఈ నిర్మాణ పనిలో ఉన్న వారు భవనాల నిర్మాణంలో ఉన్నారనే అనుకోరాదని, వారు చరిత్రను నిర్మిస్తున్నారని ప్రధాని స్పందించారు. తాము ఎన్నో కట్టడాలలో పాలుపంచుకున్నా,ఈ పార్లమెంట్ భవన నిర్మాణ పని తమకు విశేష అనుభూతిని కల్పించిందని, గర్వకారణంగా భావిస్తున్నామని కార్మికులు తెలిపారు. అక్కడున్న ఓ కార్మికుడు ప్రధాని రాకపై స్పందిస్తూ రాముడు శబరి కుటీరానికి వచ్చినట్లు ఉందన్నారు. రామాయణాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రధాని బదులిస్తూ అవును ఈ భవనం మీ వంటి వారెందరికో ప్రజాస్వామ్య దివ్య కుటీరం. చాలా బాగా చెప్పారని ప్రశంసించారు. జాతీయ చిహ్నం ఆవిష్కరణకు ముందు ప్రధాని మోడీ పార్లమెంట్ ఆవరణలో స్పీకర్‌తో కలిసి అగ్నిసాక్షిగా వేదోచ్ఛారణల నేపథ్యంలో పూజాదికాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News