Monday, April 29, 2024

పాప ప్రాణం తీసి… తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Narayanamma College Student commit Suicide in Hyderabad

భోపాల్: తన భార్య తొమ్మది నెలల కూతురిని చంపి అనంతరం మూడంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని టెకీ చెబుతున్న సంఘటన భోపాల్‌లోని బైరాగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనెలోని గ్లోబల్ ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. భోపాల్ చెందిన చెకీ ఇండోర్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు తొమ్మిది నెలల పాప కూడా ఉంది. లాక్‌డౌన్ విధించడంతో భోపాల్‌లో దంపతులు ఉండిపోయారు. టెకీ ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాడు. గురువారం మూడు గంటల ప్రాంతంలో పాప ఫ్లోర్‌పై పడి ఉండడంతో గమనించి భార్య కోసం వెతికాడు. వెంటనే పాపను ఎంత లేపినా లేవకపోవడంతో భార్యను పిలుచుకుంటూ వెళ్లాడు. భార్య థర్డ్ ఫ్లోర్ ఎక్కుతున్నట్టుగా శబ్ధం రావడంతో మెట్లు పైకి వెళ్లాను. ఆమె అప్పుడే భవనం పైనుంచి కిందకు దూకడానికి ప్రయత్నిస్తోంది. ఎంత వద్దని చెప్పినా వినకుండా పైనుంచి కిందకు దూకింది. కిందకు వెళ్లి చూసేసరికి ఆమె చనిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపను ఊపిరాడక చేసి తన భార్య చంపిందని పోలీసులు టెకీ తెలిపాడు. పాపను గొంతు నులిమి చంపినట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ఆమె గత కొన్ని రోజులు మానసిక వ్యాధితో బాధపడుతోందని భర్త పోలీసులకు తెలిపాడు. రెండు మృతదేహాలను శవ పరీక్ష ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News