Monday, April 29, 2024

ఎంపి రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

MP Revanth Reddy Konda Vishweshwar reddy

 

హైదరాబాద్ : కెటిఆర్ అక్రమంగా ఫార్మ్‌హౌస్ నిర్మిస్తున్నాడని ఆరోపిస్తు సందర్శనకు వెళ్లిన మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఎంపి రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరు కలిసి గండిపేట చెరువు వెళ్లే దారిలోని జన్వాడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 25 ఎకరాల్లో కెటిఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడని వారు ఆరోపించారు. వారిని వెంటనే పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాదాపూర్ ఎసిపి శ్యాంప్రసాద రావు, నార్సింగి ఇన్స్‌స్పెక్టర్ గంగాధర్ వారిని అరెస్టు చేశారు.

MP Revanth Reddy Konda Vishweshwar reddy arrested
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News