- Advertisement -
హైదరాబాద్: మా మేనమామ యుగంధర్ రెడ్డి తన భర్త హేమంత్ను తీసుకెళ్లి హత్య చేశాడని అవంతి తెలిపింది. హేమంత్కు ఆస్తులు లేవు కానీ సంతోషంగా ఉండేవారమని, హేమంత్ను చంపిన ఏ ఒక్కరినీ వదలొద్దని పోలీసులను కోరింది. తన కుటుంబ పరువును తీసినందుకు మా డాడీ తనని చంపాలి కానీ హేమంత్ను చంపే హక్కు మా డాడీకి ఎక్కడిదని అవంతి ప్రశ్నించింది. మా నాన్నకు మారుతీ రావు గతే పడుతుందని తెలిపింది. హేమంత్, తాను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామని, మా ప్రేమ విషయం తెలిసి తనని ఏడు నెలల ఇంట్లో బంధించారని అవంతి తెలిపింది. జూన్ 10న హేమంత్ ను ప్రేమ వివాహం చేసుకున్నానని, ఇంతలోనే ఘోరం జరిగిందని బోరున విలపించింది. హేమంత్, అత్తమ్మ, మామయ్య తనని బాగా చూసుకున్నారని పేర్కొంది.
- Advertisement -