మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా వస్తోన్న ‘ఉప్పెన’ సినిమా నుండి రిలీజ్ అయిన మొదటి సాంగ్ ‘నీ కన్ను నీలి సముద్రం’ వీడియో సాంగ్ సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఈ సాంగ్ యూట్యూబ్లో ఇప్పటివరకు 150 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ ఈ సాంగ్తో తానేంటో నిరూపించుకున్నాడు. మంచి ట్యూన్తో కాస్త విభిన్నంగా ఈ పాటను కంపోజ్ చేసి సంగీత ప్రియులను బాగా ఆకట్టుకున్నాడు. అలాగే దేవిశ్రీ ట్యూన్కి జావేద్ ఆలీ మధురమైన గాత్రాన్నిఅందించాడు. శ్రీమణి సాహిత్యం కూడా సింపుల్ పదాలతో అర్ధవంతంగా ఉంది. మొత్తానికి ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది. బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించనున్నాడట.
Thank you all for the Immense Love ❤️#NeeKannuNeeliSamudram https://t.co/na5j84Nhiw#Uppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty#BuchiBabuSana @ThisIsDSP @javedali4u @ShreeLyricist @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/dFbvX8qy35
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2020
‘Nee Kallu Neeli Samudram’ song reach 150 million views