నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్షలో మంత్రి కెటిఆర్
2022 నాటికి
పట్టాలపై బండి వస్తుంది
ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది
మిడ్మానేరు బ్యాక్వాటర్పై రోడ్ కమ్ రైలు బ్రిడ్జి
సిరిసిల్ల : సిరిసిల్లకు రైలు రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తార క రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామంలో ఉన్న అతిథి గృహం లో నిర్వహించిన నియోజక వర్గ స మీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడారు. రైల్వే సౌకర్యంతో సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం మారడమే కాకుండా జిల్లా అభివృధ్ధిలో రైల్వే కీలకంగా నిలవనుందని ఆయన చెప్పారు. జిల్లాలో రైల్వేలైన్ కోసం అవసరమున్న 845 ఎకరాల భూ సేకరణను అత్యంత ప్రాధాన్యత అ ంశంగా తీసుకుని మే నెలాఖరు నాటికి వంద శాతం భూ సేకరణ పూర్తి చేసి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టేందుకు వీలుగా రైల్వే అధికారులకు అప్పగించాలన్నారు. చట్టపరమైన చిక్కులు రా కుండా భూ సేకరణను సేకరించాలన్నారు.
రైల్వేలైన్ అలైన్మెంట్ను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. తంగళ్లపల్లి రైల్వేస్టేషన్ కార్గో మూమెంట్, అక్వాహబ్లతో అనుసంధానించాలని కెటిఆర్ పేర్కొన్నారు. రైల్వే అలైన్మెంట్లో యుటిలిటి షిప్టింగ్లను సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ధవళేశ్వరం మాదిరిగా మధ్యమానేరు జలాశయం బ్యాక్వాటర్పై రోడ్డు కమ్ రైల్వేబ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే రోడ్డు కం రైల్వే బ్రిడ్జి రింగ్రోడ్షో రింగ్ రోడ్తో అనుసంధానం చేయాలన్నారు. భూ సేకరణ పనులు త్వరిత గతిన పూర్తి చేసి రైల్వే అధికారులకు అందజేస్తే 2022 కల్లా సిరిసిల్ల జిల్లా ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే సిరిసిల్ల ప్రాంతం అన్ని విధాలుగా అభివృధ్ధి చెందుతుందన్నారు.
ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోఎక్కడికైనా తరలించి విక్రయించుకోవచ్చన్నారు. ప్రజలు తక్కువ ఛార్జీలతోనే దేశంలో ఎక్కడికైనా ప్రయాణించే వీలు కలుగుతుందన్నారు. మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు ప్రాజె క్టు జలాశయం పర్యాటక అభివృధ్ధికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి గంటన్నరలో నర్మాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పర్యాటక అభివృధ్ధికి ప్రణాళికలు వేయాలన్నారు. కాటేజీల నిర్మాణానికి, బోటింగ్, జల క్రీడలు తదితర అభివృధ్ధి పనుల కోసం ప్రణాళికలో పెద్దపీట వేయాలన్నారు.
నర్మాల జలాశయం అతిథి గృహాన్ని రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరించాలన్నారు. అతిథి గృహంలోపల ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు. నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన పనులను ప్రారంభించాల్సి ఉందన్నారు. మరో పది రోజుల్లో మళ్లీ నర్మాలకు వస్తానని, అప్పటికల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన, అతిథి గృహం ఆధునీకరణ పనులు, పర్యాటక అభివృధ్ధి పనులకు శంఖుస్థాపన చేస్తానని కెటిఆర్ పేర్కొన్నారు. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.