Saturday, April 27, 2024

రాష్ట్రంలో 11 మంది ఐపిఎస్‌లకు కొత్తగా పోస్టింగ్

- Advertisement -
- Advertisement -

New posting for 11 IPS officers in Telangana state

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖలో కొత్తగా 11 మంది ఐపిఎస్‌లకు శనివారం నాడు పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు జరీ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రం(ఎన్‌పిఎ)లో ఈ నెల 3వ తేదీన 131 మంది ఐపిఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్న విషయం విదితమే. వీరిలో తెలంగాణకు 11 మంది ఐపిఎస్‌లను కేంద్ర హోంశాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన 11 మంది ఐపిఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం శనివారం పోస్టింగ్ ఇచ్చింది. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్లుగా 11 మంది ఐపిఎస్‌లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో 2017 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన అఖిల్ మహాజన్, ఖారే కిరణ్ ప్రభాకర్, చెన్నూరి రూపేష్, నితిక పంత్, అలాగే 2018 బ్యాచ్‌కు చెందిన యోగేశ్ గౌతం, స్నేహా మెహ్రా, హర్షవర్ధన్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రితిరాజ్, బిరుదరాజు రోహిత్ రాజు, బి బాలస్వామిలు కొత్తగా నియమితులయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News