మౌంట్ మౌంగనూయి: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. కివీస్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది. కెెఎల్ రాహుల్ సెంచరీతో (112) కదంతొక్కాడు. శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు చేసి నీశమ్ బౌలింగ్ లో గ్రాండ్ హోమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడో వికెట్ పై శ్రేయస్ అయ్యర్, రాహుల్ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్ పై రాహుల్, పాండే 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మనీష్ పాండే 42 పరుగులు చేసి బెనెట్ బౌలింగ్ లో శాంట్నార్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పృద్వీషా 40 పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. తొలి వికెట్ రూపంలో మయాంక్ అగర్వాల్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిది పరుగులు చేసి బెనెట్ బౌలింగ్ లో జమ్సీన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో బెనెట్ నాలుగు వికెట్లు పడగొట్టగా నీశమ్, జమీశన్ చెరో ఒక వికెట్ తీశారు. ఇప్పటికే న్యూజిలాండ్ రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యచ్ లో కివీస్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతోంది.