Monday, April 29, 2024

డబుల్ ధమా’కారు’

- Advertisement -
- Advertisement -

పేదల అండ నిలవండి.. ప్రజల మన్ననలు పొందండి

మంచిగా ఉంటేనే బట్ట కాల్చి మీదేసే రోజులివి, చాలా జాగ్రత్తగా మసులుకోవాలి
సంయమనం, సహనంతో ఉండాలి, వేష, భాషల్లో భేషజం వద్దు, అసంబ్ధంగా మాట్లాడొద్దు
మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్‌లకు సిఎం కెసిఆర్ హితవు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు టిఆర్‌ఎస్ కైవసం
మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నిక
149 మంది కార్పొరేటర్లలో 147 మంది, 33మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు కలిసి ఓటు హక్కు
వినియోగించుకున్న 180 మంది ఓటర్లు
టిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతిచ్చిన ఎంఐఎం
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మేయర్, డిప్యూటీ మేయర్

మన తెలంగాణ/హైదరాబాద్: విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. వారికి కర్తవ్యబోధ చేశారు. కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందన్నారు. అది గొప్ప విషయం కాదన్నారు. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయమని సిఎం కెసిఆర్ అన్నారు. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి” అని ముఖ్యమంత్రి హితవు పలికారు. పదవిలో ఉన్నవారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలని సిఎం సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దన్నారు. వేష, భాషల్లో మార్పులు రావద్దు…అసంబద్ధంగా…అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దన్నారు. ప్రతి ఒక్కరిని ఆదరించాలన్నారు. వారిని అక్కున చేర్చుకోవడంతో పాటు సరైన గౌరవం ఇవ్వాలన్నారు. వారు చెప్పేది ఓపిగ్గా వినాలన్నారు. చేతనయినంత సాయం చేయాలే తప్ప అబద్దాలు మాత్రం చెప్పవద్దన్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

బస్తీల బాధలు వినండి

‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’.. అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. ప్రతి రోజూ విధిగా మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పేదలను ఆదరించడంతో పాటుగా బస్తీ సమస్యలను తీర్చాలి. ప్రజాప్రతినిధులందరికి అదే ప్రధాన లక్ష్యం కావాలి.- కెసిఆర్

గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. ప్రతి రోజు విధిగా మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలన్నారు. వారి బాధలు అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పేదలను ఆదరించడంతో పాటుగా బస్తీ సమస్యలను తీర్చాలన్నారు. ప్రజాప్రతినిధులందరికి అదే ప్రధాన లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయన్నారు. అలాగే మంచి భవిష్యత్ కూడా ఉన్నదన్నారు. నిజమైన విశ్వనగరమిదని, బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారన్నారు. నగరంలో సింథ్ కాలనీ ఉంది… గుజరాతి గల్లీ ఉంది… పార్సీగుట్ట కూడా ఉందనేనారు. అఇలాగే బెంగాలీలున్నారు… మలయాళీలున్నారు… మార్వాడీలున్నాయి… ఖాయస్తులున్నారన్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారన్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుందన్నారు. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం హైదరాబాద్ అని వ్యాఖ్యానిచారు. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద చాలా ఉన్నదన్నారు. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని మరింతగా పెంచాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలన్నరు. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వాటికి గ్రేటర్ పాలక వర్గం కూడా పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్ గా అవకాశం దక్కుతుందన్నారు. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేమన్నారు. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరని, అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవ రావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, ఐకె రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Newly elected Mayor and Deputy Mayor meets CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News