Monday, April 29, 2024

మీ హయాంలో రైతులకు తూటాలు

- Advertisement -
- Advertisement -

పదేళ్ల మీ పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి
కరెంటుతో వేలమంది
పాముకాటుకు, విద్యుత్ షాక్‌లకు
బలయ్యారు పంట కొనాలని, బకాయిలు
చెల్లించాలని అడిగిన రైతులపై కాల్పులు
జరిపారు ముదిగొండ ధర్నా మీదకు
పోలీసులను ప్రయోగించి ఏడుగురి
ప్రాణాలను మీరు ఇయ్యాల
రైతుసభలు పెడతారా?: రాహుల్‌గాంధీకి
వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ

There are no restrictions on Paddy:Minister Singireddy Niranjan Reddy

మన తెలంగాణ/హైదరాబాద్: దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన పాపఫలితమే నేటి వ్యవసాయరంగం దయనీయ స్థితికి కార ణం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం నా డు బహిరంగ లేఖ రాశారు. కాం గ్రెస్ పార్టీ అంతులేని వైఫల్యాల చరిత్రను ఒక్క లేఖలోనో.. ఒక్క మాటలోనో చెప్పడం సాధ్యంకాదన్నా రు. యుపిఎ పదేండ్ల పాలనలో ఎక్కడచూసినా రైతన్నల మరణమృదంగ విషాదమే అన్నారు. ఎన్‌సిబిఆర్ లెక్కల ప్రకారమే 1,58,117 రైతులు అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్న విష యం వాస్తవం కాదా అని ప్రశ్నించా రు. తెలంగాణ ఆవిర్భావానికి ముం దు పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రైతాంగానికి ఒరిగింది శూన్యం అన్నారు. నిలకడలేని కరం టు, అర్ధరాత్రి కరెంట్ తో అనేక మం ది పాముకాటుకు, కరంటు ల కు గురయి వేలమంది మరణించింది నిజం కాదా అని నిలదీశారు. పండించిన పంటను కొనమని, బకాయిలు అడిగిన ఎర్రజొన్న రైతులను కాల్చి చంపిన కర్కశ పా లన కాంగ్రెస్ నాడు రైతులపైన తుపా కీ తూటాలు పేల్చిన మీరు ఇయ్యాల రైతు సభలు పె డ్తరా అని నిలదీశారు.

ప్రభుత్వ భూములు పంచాల ని, పేదలకు ఇంటి జాగాలు  పంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ముదిగొండ ధర్నా మీద కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. బుల్లెట్లు కురిపించి రైతులను పొట్టన పెట్టుకున్న పాపానికి, ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని నీచమైన రాజకీయాలు చేసిన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు.రైతాంగాన్ని రక్తకన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అన్నదాత ఎన్నటికీ క్షమించడన్నారు. వరిధాన్యం కొనుగోలుపై మోడీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతు ఆందోళనకు దిగినప్పుడు ఎక్కడ పడుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తామని సభలు ఎందుకు పెట్టరని నిలదీశారు. వ్యవసాయం మీద, రైతుల కష్టాల మీద రాహుల్ గాం ధీకి ఉన్న అవగాహన ఏమిటన్నారు. రాహుల్ గాంధీ వ్యవసాయం గురించి మాట్లాడటం అంటే అదొక వింత అన్నారు.కేవలం ఎనిమిదేళ్ల పాలనలో 58 ఏళ్ల అన్యాయాలను తుడిచిన ఘనత మా రైతు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది .. వ్యవసాయరంగానికి సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, కరంటు మౌళిక వసతుల కల్పన కోసం అన్నీ కలిపి ఈ ఎనిమిదేళ్లలో రూ.3 లక్షల 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదన్నారు. ఈ దేశంలో రైతుకు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ ఎనిమిదేండ్లలో ఉచిత విద్యుత్ కోసం 87 వేల కోట్లకుపైగా ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు.

ఈ వెలుగులను కూడా ఓర్చుకోలేక లోకల్ కాంగ్రెస్ నాయకులు 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలని కేంద్రానికి లేఖలు రాస్తూ రైతు ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. భవిష్యత్లో రైతుకు కరెం ట్ కష్టమే రానివ్వకుండా కాపాడే యాదాద్రి థర్మ ల్ ప్లాంట్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూసేస్తామని మీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రకటనలు చేస్తున్నారని , దీనికి మీరు ఏం చెబుతారని ప్రశ్నించారు.దేశ చరిత్రలో అత్యధిక కాలం అటు కేంద్రంలో… దశాబ్దాల పాటు ఇటు రాష్ట్రాల్లో అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ… ఆ తర్వాత వచ్చిన బిజెపి పార్టీల అసమర్థ విధానాల వల్లనే ఈ రోజు దేశం ఈ దుస్థితిలో ఉన్నదన్నారు.తెలంగాణ ప్రాంతానికి 60 ఏండ్లు కాంగ్రెస్ చేసిన ద్రోహాలను తట్టుకుని ప్రజల ఆకాంక్షలు, పోరాటాలకు అండగా నిలిచి, అప్ప టి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకున్న టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు,తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పరిపాలనతో పరిఢవిల్లుతున్నదన్నారు.

ఈ రోజు తెలంగాణ విధానాలను దేశం స్వాగతిస్తూ, స్వీకరిస్తున్నదని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయరంగంలో చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాలను దేశం ఆదర్శంగా తీసుకుంటున్నదన్నారు. అన్నదాత ఏ కారణం చేత చనిపోయి నా 5 లక్షల రూపాయల ఆర్థికసాయం చేసే కు టుంబాలను రోడ్డున పడకుండా ఆదుకునే రైతు భీ మా తీసుకొచ్చిన మా మానవీయ పాలన ఎక్క డ..? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వకుండా ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ. తిప్పుకున్న మీ క్రూరమైన పాలన ఎక్కడ.. అని నిలదీశారు.

70వేల టిఎంసీల నీళ్లతో పొంగిపొర్లే జీవనదులున్నా, సగం కూడా వాడుకోలేక కరువు కాటకాలకు కారణమైన తెలివి తక్కువ, అసమర్థ పార్టీ మీది కాదా అని ప్రశ్నించారు.ఇలాంటి పరిస్థితులలో రైతు సంఘర్షణ సభ పేరుతో తెలంగాణలో రాజకీయం చేసేందు కు వస్తున్న రాహుల్ గాంధీ పై అంశాలపైన తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బహిరంగలేఖ ద్వారా వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News