- Advertisement -
న్యూఢిల్లీ: చేనేత, వస్త్రపరిశ్రమపై జీఎస్టీ పెంపు అమలు వాయిదా పడింది. వాయిదా వేయాలని జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. జౌళిపై రేపట్నుంచి జీఎస్టీ పెంపు అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం జౌళిపై జీఎస్టీని 5 నుంచి 12శాతానికి పెంచింది. రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. జౌళి ఉత్పత్తులపై జీఎస్టీ పెంపును మరోసారి వాయిదా వేస్తున్నామని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జౌళి ఉత్పత్తులపై జీఎస్టీ పెంపును గతంలోనూ వాయిదా వేశామని తెలిపారు. జీఎస్టీ పెంపును అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయని నిర్మలా వెల్లడించారు.
Nirmala Sitharaman chairs 46th GST council meet
- Advertisement -