Sunday, April 28, 2024

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి…. మహిళపై పాస్టర్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Seer raped

 

అమరావతి: ఓ మహిళకు పాస్టర్ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమేకాకుండా ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి పలుమార్లు బెదిరించి… లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాచర్ల జోయెల్ అనే వ్యక్తి ఇమ్మానియేల్ గాస్పెల్ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రార్థనలు వచ్చిన వివాహితపై పాస్టర్ కన్నుపడింది. ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి తాగించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. అశ్లీల వీడియోలను తన ఫోన్‌లో బద్రపరుచుకొని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. దీంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో మానసికంగా బాధపడుతున్న భార్యను భర్త మందలించాడు. ఆమె జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఇనగుదురు పేట పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

 

Pastor rape on Women with Drug in Machilipatnam
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News