Wednesday, May 8, 2024

రాష్ట్రానికి విరాళం ప్రకటించిన జనసేనాని

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan announced Rs 1 crore donation

హైదరాబాద్: భారీవర్షాలకు, వరదలకు నష్టపోయిన తెలంగాణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయూతను అందించారు. ముంపు ప్రాంతాల్లో సాహయక చర్యల కోసం తనవంతుగా కోటిరూపాయల విరాళం ప్రకటించారు. హైదరాబాద్ వరద ప్రాంతాల సహయక చర్యల్లో జనసైనికులు, అభిమానులు పాల్పంచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరంలో భారీవర్షం పడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్నేళ్లుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో రోడ్ల పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారి జీవితాలు నీట మునిగాయి. ఈ క్రమంలో పలువురు సినీప్రముఖులు తెలంగాణ సహాయ నిధికి తమ వంతుసాయం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ విరాళాలు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ వరద బాధితులకు జనసేనాని పవన్ కళ్యాణ్ రూ. కోటి ఆర్ధిక సాయం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News