‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై స్పందించింది. బాలీవుడ్లో నెపోటిజం ఉందని చెప్పిన ఈ భామ బాలీవుడ్ దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇవ్వకుండా నిరుత్సాహపరిచారని పేర్కొంది. దీంతో సినిమాల్లో రాణించాలనే పట్టుదల తనను టాలీవుడ్ వైపు అడుగులు పడేలా చేసిందని పాయల్ పేర్కొంది. అవకాశాలు వచ్చినా రాకపోయినా మనసుని ధృడంగా ఉంచుకొని ముందుకు సాగాలే తప్ప ఆత్మహత్య పరిష్కారం కాదని ఈ భామ ట్వీట్ చేసింది. బుల్లితెరపై తన హవా చూపించిన పాయల్ బాలీవుడ్లో ‘వీరే కీ వెడ్డింగ్’ అనే సినిమాలో నటించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పాయల్ పైలెట్గా నటిస్తోందట. అయితే ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తమిళ్లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ’ఏంజెల్’ అనే సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె కోలీవుడ్లో పాగా వేసే అవకాశం ఉంది. ఇక తన సొంత భాష పంజాబీలో మాత్రం ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయట.
మనసుని ధృడంగా ఉంచుకొని ముందుకు సాగాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -