Monday, April 29, 2024

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

Petrol and diesel price hiked for 20th day

హైదరాబాద్: దేశంలో వరుసగా 21వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.38, డీజిల్ ధర రూ.80.40గా ఉంది. పెట్రోల్ కంటే డీజిల్ ధర అధికంగా పెరిగింది. ఇక, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.83.22, డీజిల్ ధర రూ.79.80గా ఉంది. గత 21 రోజుల్లో పెట్రోల్‌పై రూ.9.18, డీజిల్‌పై రూ.10.28 పెరిగాయి. ఇలా వరుసగా చమురు ధరల పెంపుపై వాహనాదారులు ఆందోళనలు వ్యక్తం చేస్తునారు.

Petrol and Diesel prices increased for 21st day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News