- Advertisement -
మహిళా ఎస్ఐకి అధికారుల ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా లాక్ డౌన్లో ముందు వరుసలో ఉన్న పోలీసులు ప్రజాసేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. ప్రసవవేదనతో బాధపడుతున్న ఒక మహిళను పోలీసు వాహనంలో తీసుకువెళ్లి కొండాపూర్ ఆసుపత్రిలో చేర్పించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లోని మహిళా ఎస్ ఐ మౌనిక చొరవ తీసుకుని పోలీసువాహనంలో గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. లాక్ డౌన్ సమయంలో వాహనాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ వాహనంలోనే సకాలంలో ఆమెను ఆసుపత్రికి చేర్చిన విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మౌనికను ట్విట్టర్ వేదికగా అభినందించారు. అధికారుల నుంచి మౌనిక ప్రశంసలు అందుకున్నారు. స్థానికులు పోలీసుల సేవలను కొనియాడారు.
Pregnant woman rushed to Hospital in Police vehicle
- Advertisement -