Saturday, April 27, 2024

‘పుష్ప’ సెకండ్ సింగిల్ ‘శ్రీవల్లీ’ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందాన జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’. ఈ చిత్రాన్ని క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని రెండో సాంగ్ విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 13న ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సాంగ్ ను రష్మీక పై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ మూవీ ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

PUSHPA Sencond Single to release on Oct 13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News