Monday, April 29, 2024

కోడి, చేపల కూర ఇవ్వలేదని… ఆశా కార్యకర్త చేయి విరగొట్టాడు…

- Advertisement -
- Advertisement -

Quarantine person beat asha worker

 

బెంగళూరు: కోడి, చేపల కూర భోజనంలో ఇవ్వడంలేదని క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఆశా కార్యకర్త చేయి విరగొట్టిన సంఘటన కర్నాటకలోని కలబురిగిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరోనా వైరస్ సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉండడంతో సోమనాథ్ సోనకాంబళే అనే వ్యక్తిని క్వారంటైన్ చేశారు. చికెన్, చేపల కూర భోజనం కావాలని ఆశా కార్యకర్త రేణుక నాగప్పను డిమాండ్ చేశాడు. ఉన్నతాధికారులు సూచించిన భోజనాన్ని మాత్రమే క్వారంటైన్ లో ఉన్నవారికి ఇస్తున్నామని తెలియజేశారు. కోపంతో ఊగిపోయిన సోమనాథ్ రేణుకపై దాడి చేశాడు. ఆమె చేయి విరగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News