- Advertisement -
లండన్: యుకెలో ఒమిక్రాన్ ఉథృతి నేపథ్యంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్2(95) క్రిస్టమస్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాజకుటుంబం ఏటా క్రిస్టమస్ వేడుకల్ని తూర్పు ఇంగ్లాండ్లోని సాంద్రింఘమ్ ఎస్టేట్లో జరుపుకోవడం ఆనవాయితీ. అయితే, ఈసారి రాణి ఎలిజబెత్2 వేడుకలకు దూరంగా ఉంటారని బకింగ్హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. క్రిస్టమస్ రోజున ఆమె విండ్సోర్లోని కోటలోనే గడుపుతారని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా రాజకుటుంబం క్రిస్టమస్ వేడుకలకు దూరంగా ఉండటం ఇది రెండో ఏడాది. మరోవైపు ఎలిజబెత్2 భర్త ఫిలిప్ ఈ ఏడాది ఏప్రిల్లో మరణించారు.
- Advertisement -