Monday, April 29, 2024

ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత

- Advertisement -
- Advertisement -

Rangam in Laskhar bonalu

 

హైదరాబాద్: భక్తులకు సంతోషాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నానని భవిష్యవాణి స్వర్ణలత తెలిపింది. లష్కర్ బోనాల్లో రంగం వేడుక సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. కరోనా అనే మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనని నమ్మినందుకు సంతోషంగా ఉందన్నారు. తన భక్తులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే భారం తనదేనని చెప్పారు. భక్తుల మొక్కులు తాను సంతోషంగా స్వీకరించానని స్వర్ణలత తన భవిష్యవాణిలో పేర్కొన్నారు. తనకు పూజలు ఆపొద్దని, బోనం తప్పకుండా సమర్పించాలని, అప్పుడే అమ్మవారు కరుణించి కోరికలు తీరుస్తందని ఆమె తెలిపారు. భారీ వర్షాలు కురువడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News