Monday, April 29, 2024

శంషాబాద్‌లో నకిలీ సాస్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్‌పై శంషాబాద్ ఎస్‌ఒటి పోలీసులు దాడులు చేశారు. హానికర రసాయనాలు, సింథటిక్ రంగులతో సాస్ తయారు చేస్తున్నట్టు ముఠాను పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యుల నుంచి 772 లీటర్ల కల్తీ సాస్, 30 లీటర్ల ఎసిటిక్ ఆసిడ్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రూ.3.5 లక్షలు విలువ చేసే కల్తీ సాస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News