రాయ్పూర్: ఆరేళ్ల సోదరుడిని చంపి అనంతరం ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి బావిలో పడేసిన సంఘటన ఛత్తీస్గఢ్లోని కోరియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్క, తమ్ముడు గ్రామ శివారులో ఆడుకుంటుండగా పక్క గ్రామానికి చెందిన యువకుడు(17) పూజా కోసమని ఆకులు సేకరిస్తున్నాడు. అతడు తెలిసిన వాడే కావడంతో ఆ పిల్లలను సహాయం చేయమని అడిగాడు. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఐదు సంవత్సరాల వయసు ఉన్న బాలుడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గుబురు పొదల్లో పడేశాడు. తన సోదరుడి చంపడం చూసి బాలిక వణికిపోయింది. బాలికను తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను లోతైన బావిలో పడేశాడు. బాలికకు ఈత రావడంతో ప్రాణాలు దక్కించుకుంది. నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత బాలిక కేకలు వేయడంతో ఓ వ్యక్తి గమనించి ఆమెను బయటకు తీశాడు. అనంతరం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.