- Advertisement -
న్యూఢిల్లీ: గాఢ నిద్రలో ఉన్న ఎనిమిదేళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలోని సదార్ బజార్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలిక తన నానమ్మతో తల్లి కలిసి ఆరుబయట పడుకుంది. వాళ్లు గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత సుదామా(40) అనే వ్యక్తి బాలికను ఎత్తుకెళ్లాడు. అరకిలో మీటర్ వెళ్లిన తరువాత బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. వృద్ధురాలుకు మెలుకువ రావడంతో బాలిక కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులకు తెలిపింది. కొద్దీ దూరం వెళ్లి చూడగా ఏడుస్తూ బాలిక కనిపించింది. బాలిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తే అత్యాచారం జరిగిందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఐపిసి 363, 376, పోస్కో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- Advertisement -