- Advertisement -
శ్రీనగర్: మూడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన జమ్ము కశ్మీర్లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పవన్ సింగ్ (18) అనే యువకుడు తన ఇంటి పక్కన ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. చిన్నారి ఏడుపులు వినపడడంతో తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాప తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్త చిన్నారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Rape on Three Years old Girl in Jammu and Kashmir
- Advertisement -