Saturday, April 27, 2024

టాలీవుడ్‌కు కొత్త శోభ..

- Advertisement -
- Advertisement -

 

ఫొటోనేంః పవన్‌కళ్యాణ్, రవితేజ, అఖిల్, నాగచైతన్య, శర్వానంద్, డిఎస్‌ఆర్ ఫిలిం, కోతి కొమ్మచ్చి, 1992, రేణు దేశాయ్
దసరా సందర్భంగా కొత్త సినిమాల ప్రారంభోత్సవాలతో టాలీవుడ్ కళకళలాడింది. కొత్త సినిమాల ప్రకటనలు, సినిమా అప్‌డేట్స్, పోస్టర్లు ప్రేక్షకులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో దసరాకు సినిమాలు విడుదల కాకపోయినప్పటికీ సినిమా ఓపెనింగ్‌లు, అప్‌డేట్స్, పోస్టర్లతో టాలీవుడ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
పవర్‌స్టార్ కొత్త చిత్రం…
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర తెరకెక్కించనున్నారు. ‘గబ్బర్ సింగ్’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన పవన్‌కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్, ఛాయాగ్రాహకునిగా ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటర్‌గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏ.ఎస్.ప్రకాష్‌లను ఎంపిక చేశామని తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లో రెండు చిత్రాలతో…


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ‘క్రాక్’. ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఈ హీరో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. వాటిలో దర్శకుడు రవివర్మతో ప్లాన్ చేసిన ఆసక్తికరమైన సినిమా ‘ఖిలాడి’ కూడా ఒకటి. అయితే రవితేజ వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లోనే ఈ రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. దసరా సందర్భంగా క్రాక్, ఖిలాడి చిత్రాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ‘క్రాక్’ను సంక్రాంతి రేస్ లో నిలుపనుండగా ‘ఖిలాడి’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేయనున్నామని ఫిల్మ్‌మేకర్స్ తెలియజేశారు.
టీజర్‌తో అఖిల్ హల్‌చల్…


యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ టీజర్ దసరా కానుకగా విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. జీఏ2 బ్యానర్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
కొత్త చిత్రాల సందడి…

నాగచైతన్య హీరోగా సూపర్ హిట్ మూవీ ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘థాంక్ యు’ అనే ఈ సినిమాను దసరా సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభించారు. దిల్ రాజు బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో శర్వానంద్ కొత్త చిత్తం ‘ఆడళ్లు మీకు జోహార్లు’ సినిమా తిరుపతిలో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన్నలపై ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచాన్ చేయగా… ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, 14 రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సి బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. డి ఎస్‌ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హాస్య నటుడు గౌతమ్‌రాజు అబ్బాయి కృష్ణ, ఆయుషి హీరోహీరోయిన్లుగా డి.ఎస్.రాథోడ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది.

Renu Desai's Aadya Web Series Launch

పూజ కార్యక్రమం అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్ ఇవ్వగా, కె.ఎస్.రవి కుమార్ కెమెరా స్విచాన్ చేశారు.అనంతరం పాత్రికేయులతో దర్శకులు డి.ఎస్.రాథోడ్ మాట్లాడుతూ “నవంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. తాండూరులో మొదటి షెడ్యూల్ ప్రారంభించి రెండో షెడ్యూల్‌ను నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ లో జరుపుకుంటాము. పాటల కోసం బ్యాంకాక్ వెళ్తాం”అని తెలిపారు.
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత దిల్ రాజు మొదటి షాట్‌కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ “యూత్‌ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ను నవంబర్ 3 నుండి అమలాపురంలో మొదలుపెడతాము. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్‌లో ఈ సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము”అని అన్నారు.
పివియం జ్యోతి ఆర్ట్ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘1992’. విజయ దశమిని పురస్కరించుకొని ఈ చిత్రంలోని ‘చెలియా చెలియా…’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ లాంచ్ చేయగా… మరో లిరికల్ వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ “నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా ఉంటున్నాయో ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మా సినిమా చివరి దశలో ఉంది”అని అన్నారు.

ఒక పవర్‌ఫుల్ లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ‘ఆద్య’తో తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు రేణు దేశాయ్. డి.ఎస్.కె.స్క్రీన్, సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై డి.ఎస్.రావు, రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌తో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నందిని రాయ్‌తోపాటు బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనేక ప్రత్యేకతలు కలిగిన ‘ఆద్య’ విజయదశమి రోజున ఆరంభమైంది.

Renu Desai’s Aadya Web Series Launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News