- Advertisement -
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం హీరోయిన్ సాయిపల్లవికి దక్కబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న చిరు ఆ తరువాత మెహర్ రమేష్, వినాయక్ల దర్శకత్వంలో నటించనున్నారు. కాగా చిరు హీరోగా మెహర్ రమేష్ వేదాళం రీమేక్ని తెరకెక్కించనున్నారు. ఇందులో చిరు చెల్లెలి పాత్రలో సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు జరపడం, వెంటనే సాయి పల్లవి ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం. కాగా ఒరిజనల్ వేదాళంలో అజిత్ హీరోగా, అతడి చెల్లిలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించారు. ఈ మూవీలో చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
- Advertisement -