Monday, April 29, 2024

ఎస్సీ కులాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్సీ కులాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ అభివృద్ది, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ప్రతీ నిదుల బృందం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కొప్పులను కలిసి రాష్ట్రంలో మాలలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈసందర్భంగా కొప్పుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎస్సీ కులాలు, వర్గాల ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పధకానికి శ్రీకారం చుట్టారాని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పధకాలు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో అన్ని కుల సంఘాలకు ఉన్న విధంగా రూ. 10 కోట్ల వ్యయంతో మాలల భవనం నిర్మించాలని కోరారు.

దళిత బంధు రెండో విడతలో 80 శాతం మాలలకు ఇవ్వాలని, గృహలక్ష్మి పధకాలంలోనూ అధిక సహాయం అందిస్తూ ఇళ్లు లేని నిరుపేద మాలాల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వార్షిక ఆదాయం రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచుతూ ప్రభుత్వం అంద చేస్తున్న మూడు ఎకరాల భూమిని ఐదు ఎకరాలకు పెంచాలని కోరారు. ప్రైవేట్ విద్య సంస్థలల్లో 10 వ తరగతి లోపు ఎస్సీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, రియంబర్స్‌మెంట్ చెల్లించి అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసిన ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పించాలన్నారు. ఎస్సీ అనుబంద కులాలకు రిజర్వేషన్ లబ్ది పొందని కులాలను గుర్తించి నిధులు కేటాయించాలని సూచించారు. నగరంలో భాగ్య రెడ్డి వర్మ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రావుల అంజయ్య, మాల మహానాడు పీవి రావు వ్యవస్థపాక అధ్యక్షులు చెరుకు రామ చందర్, వర్కింగ్ చైర్మన్ తాళ్ల పల్లి రవి, తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నర్సింహ, కార్యదర్శి రావుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News