Sunday, April 28, 2024

అకాల వర్షాలు.. భయపెడుతున్న సీజనల్ వ్యాధులు

- Advertisement -
- Advertisement -

Seasonal diseases increasing with premature rains

దగ్గు,జలుబు, జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట
పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీదవఖానల్లో రోగుల రద్దీ
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు

హైదరాబాద్: నగరంలో వాతావరణ మార్పులతో అకాల వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు పంజా విసురుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఐదారు రోజుల నుంచి చిరుజల్లు పడుతుండటంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులతో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానలు రోగులతో రద్దీగా మారాయి. వర్షాలు ఇంకా కురిస్తే కొత్త రోగాలు పుట్టకొస్తాయని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజలు కరోనా నుంచి కోలుకుని రోజు వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్దికంగా కుదుట పడుతుండగా సీజనల్ వ్యాధులతో మంచం పడుతున్నారు. ఏమాత్రం జ్వరానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే సమీపంలోని బస్తీదవఖానలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రోజుకు 500 నుంచి 800వరకు, పట్టణ ఆరోగ్య, బస్తీదవఖానలకు 120మంది వరకు వస్తున్నట్లు ఆసుపత్రుల సిబ్బంది వెల్లడిస్తున్నారు.

ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో చెత్తా చెదారం ఎక్కడిక్కడే పేరుకుపోవడంతో దోమలు పెరుగుతున్నట్లు, స్దానిక మున్సిఫల్ అధికారుల ఫాగింగ్ చేయకపోవడంతో రోడ్లపై నీరు నిల్వడంతో రోగాలు పుట్టుకొస్తున్నాయని స్దానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రోగుల సంఖ్య పెరిగితే ఫీవర్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సకాలంలో చికిత్సలు అందించేలా చూడాలని వైద్యులు కోరుతున్నారు. ఇదే అదునుగా బావించిన కార్పొరేట్ ఆసుపత్రులు జ్వరంతో రోగులు వస్తే పది రకాల టెస్టులు చేసి డెంగ్యూ, మలేరియా సోకిందంటూ ఆసుపత్రుల్లో చేర్చకుని లక్ష రూపాయలు దండుకునే పనులకు ఒడిగడుతున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల రోగుల బాధితుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలని సూచిస్తున్నారు.

దోమల కాటుతో సీజన్ వ్యాధుల ముప్పు తప్పదు:  వైద్యాధికారులు

నగరంలో కురుస్తున్న వానలకు రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పాటు, చెత్త ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలను కంటిమీద కునుకు లేకుండా కాటు వేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఫాగింగ్ చేయడంతో పాటు, చెత్తను ఎప్పటికప్పడు తొలగిస్తే ప్రజలకు సోకకుండా కాపాడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News