Monday, April 29, 2024

పాండేకు ఇక చోటు కష్టమే

- Advertisement -
- Advertisement -

Sehwag reckons Manish Pandey may no longer get chance in Teamindia

 

న్యూఢిల్లీ : అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భారత బ్యాట్స్‌మన్ మనీష్ పాండే ఘోరంగా విఫలమయ్యాడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వాపోయాడు. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లోనూ మనీష్ నిరాశ పరచడం తనను బాధకు గురిచేసింది. ఇకపై అతనికి టీమిండియాలో చోటు లభిస్తుందని తాను భావించడం లేదన్నాడు. జాతీయ జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకునేందుకు లభించిన సువర్ణ అవకాశాన్ని అతను జారవిడుచుకున్నాడని పేర్కొన్నాడు. ఇక లంక సిరీస్‌లో పృథ్వీషా, సూర్యకుమార్ బ్యాటింగ్ చేసిన తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ఇద్దరు స్వేచ్ఛగా ఆడుతూ భవిష్యత్తుపై ఆశలు చిగురింప చేశారని సెహ్వాగ్ ప్రశంసించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News