Monday, April 29, 2024

మూడు రోజుల నష్టాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -
Sensex jumps 767 points
767 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : వరుసగా మూడు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లకు వారాంతం శుక్రవారం ఊరట లభించింది. ఐటి స్టాక్స్, ఇతర ఇండెక్స్‌లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 767 పాయింట్లు పెరిగి 60,686 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 18,102 పాయింట్ల వద్ద స్థిరపడింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా అత్యధికంగా 4 శాతం లాభపడింది. ఆ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం వరకు పెరిగాయి. మరోవైపు బజాజ్ ఫిన్‌సర్వ్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టి, నెస్లే ఇండియా టాప్ లూజర్లుగా మిగిలాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News