Sunday, April 28, 2024

ఆ దేశాలు నిధులిచ్చాయి.. అందుకే వ్యాక్సిన్ ధర తక్కువ

- Advertisement -
- Advertisement -

Serum Institute responded on criticism over price of Covishield vaccine

కొవిషీల్డ్ ధరపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వివరణ

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై వస్తున్న విమర్శలపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ శనివారం స్పందించింది. భారత దేశంలోని ధరలను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడడం సరికాదని తెలిపింది. కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీ కోసం ముందుగానే నిధులు సమకూర్చినందున ఆ దేశాల్లో వ్యాక్సిన్ ధర తక్కువగా ఉందని వివరించింది. భారత ప్రభుత్వంతో సహా అన్ని దేశాల ప్రభుత్వాల ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లకు సరఫరా చేస్తున్న కొవిషీల్డ్ ప్రారంభ ధర తక్కువగానే నిర్ణయించినట్లు పేర్కొంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో తాము అయిదు దశాబ్దాలనుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల సరఫరా, ప్రాణ రక్షణ లో ముందు వరసలో ఉన్నట్లు తెలిపింది. తాము ప్రతి మానవ జీవితాన్ని గౌరవిస్తామని పేర్కొంది. ధరల విషయంలో ఏర్పడిన సందేహాల నివృత్తికి ఓ స్టేట్‌మెంట్‌ను జతచేసింది. దేశవ్యాప్త ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కోసం భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు అతి తక్కువ ధరకు వ్యాక్సిన్‌నుసేకరిస్తున్నాయని తెలిపింది.

దీనికి కారణాన్ని వివరిస్తూ ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్‌ను కొనడం వల్ల ధర తక్కువగా ఉందని తెలిపింది. దీనికి ఓ ఉదాహరణను కూడా తెలిపింది. అదేమిటంటే మార్కెట్ పరిస్థితులను బట్టి తమ న్యుమోకాకల్ వ్యాక్సిన్ సహా చాలా వ్యాక్సిన్ల ధరలు స్వేచ్ఛా మార్కెట్‌లో అధికంగానే ఉంటాయని, అయితే ప్రభుత్వానికి స్వేచ్ఛా మార్కెట్ ధరలో మూడో వంతుకే లభిస్తాయని తెలిపింది. గ్లోబల్ మార్కెట్, భారత్ మధ్య వ్యాక్సిన్ ధరను పోల్చడం సరికాదని తెలిపింది. నేడు మార్కెట్‌లో అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉన్న కొవిడ్19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ మాత్రమేనని తెలిపింది.ఎల్‌రిస్క్ వ్యాక్సిన్ మాన్యుఫాక్చరింగ్ కోసం ఆయా దేశాలు సమకూర్చిన అడ్వాన్స్ ఫండింగ్ ఆధారంగా అంతర్జాతీయ ధరలను ప్రారంభంలో అతి తక్కువగా నిర్ణయించినట్లు వివరించింది.

భారత ప్రభుత్వంతో సహా అన్ని ప్రభుత్వాల ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలకు కొవిషీల్డ్ ప్రారంభ సరఫరా ధర అతి తక్కువగానే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని, ఈ వైరస్ నిత్యం మార్పు చెందుతోందని, ప్రజలు చాలా రిస్క్‌లో ఉన్నారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో తాము నిలదొక్కుకొని, ప్రాణాలను కాపాడడం కోసం, ఈ మహమ్మారితో పోరాడే సామర్థాన్ని పెంచుకోవడానికి పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉందని పేర్కొంది. ఒక మోతాదు కొవిషీల్డ్‌ను రూ.600 చొప్పున ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముతామని, అయితే ఈ విధంగా జరిగే అమ్మకాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపింది. కొవిషీల్డ్ ధర అనేక ఇతర చికిత్సలకు అయ్యే ఖర్చుకన్నా చాలా తక్కువ అని పేర్కొంది. తమ ధరల విధానాలు పారదర్శకంగా ఉన్నట్లు వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News