Monday, April 29, 2024

ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడి.. ఏడుగురు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Seven militants killed in airstrikes in Afghanistan

 

ఆప్ఘ‌నిస్థాన్ : ఆఫ్ఘ‌నిస్తాన్ బాల్ఖు ప్రావిన్స్ లోని చోమ్తాల్ జిల్లాలో జ‌రిగిన వైమానిక దాడిలో ఏడుగురు తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. ఈ దాడిలో మ‌రో ఐదుగురు ఉగ్ర‌వాదులు గాయ‌ప‌డ్డారని ఆఫ్ఘ‌నిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ ట్వీట్ చేసింది. ఈ వైమానిక దాడిలో ఉగ్ర‌వాదుల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ధ్వంసం చేసిన‌ట్లు మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఫ‌రా ప్రావిన్సులోని బోలోక్ జిల్లాలో మ‌రో 8 మంది తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు హ‌త‌మార్చామ‌ని తెలిపింది. తాలిబ‌న్ నాయ‌కులు తమ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు వ‌రుస వీడియోలు వెలువ‌డిన త‌ర్వాత ఈ వైమానిక దాడి జ‌రిపామ‌ని వివ‌రించింది. ఇప్ప‌టికే ఆప్ఘనిస్తాన్‌లో వ‌ర‌స దాడుల‌తో అట్టుడుకుతోంది.  ఇలా ఉగ్ర‌వాదుల వ‌రుస దాడుల‌తో రెచ్చిపోవ‌డంతో వైమాన‌క దాడి చేప‌ట్టి తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News