ముంబై: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో బాలీవుడ్ సంబంధాలను తెలిపే వీడియోలు వెలువడ్డాయి. ప్రముఖ నటుడు షారూక్ ఖాన్, భార్య గౌరీలు ఉగ్రవాద మద్దతుదార్లు అయిన రెహాన్ సిద్థిఖీ, టోనీ అషాయ్తో కలిసి ఉన్నప్పటి ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తళుక్కుమన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అయిన షారూక్కు సతీసమేతంగా రెహాన్తో, టోనీతో పలురకాల వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, భారత్ వ్యతిరేక ప్రకటనలు చేసిన ఈ ఇద్దరూ జమ్మూ కశ్మీర్లో పలు రకాలుగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రెహాన్, టోనీలకు ఐఎస్ఐతో పలు సంబంధాలు ఉన్నాయని.. వీరిని తరచూ షారూక్, ఆయన భార్యతో కలుస్తుంటారని వాదనలు విన్పిస్తున్న దశలో ఇప్పుడు వెలువడ్డ ఫోటోలు సంచలనంగా మారాయి. టోనీ అమెరికాలో ఉంటున్నాడు. భారత్ అంటే పూర్తి స్థాయిలో ద్వేషంతో మండిపడుతున్నారు. టోనీ కశ్మీర్లో జన్మించాడు. కశ్మీరీ యువత రాళ్లు పట్టుకుని, తుపాకులతో ముందుకు సాగాలనే పలు వ్యాఖ్యలకు దిగారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల సానుభూతిపరుడిగా కూడా పేరుంది. రెహాన్ సిద్ధిఖీ పాకిస్థానీ, ఇప్పుడు అమెరికాలోని హుస్టన్లో ఉంటున్నాడు. అక్కడ సొంతంగా రేడియో ఛానల్ ఉందని, తన ఛానల్ ద్వారా కశ్మీర్లో ఉగ్రవాద చర్యలను సమర్థిస్తూ వ్యాఖ్యానాలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. సిద్ధిఖీకి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంగీతకచేరీలు నిర్వహించాడు. వీరితో కలిసి బాలీవుడ్ బాదుషా షారూక్ ఖాన్ వ్యాపారాలు సాగిస్తున్నారని తెలిపే ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. బిజెపి సీనియర్ నాయకులు బైద్యనాథ్ జయ్ పాండా ఒక్కరోజు క్రితమే బాలీవుడ్ ప్రముఖులు కొందరికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద పలు సాక్షాధారాలు ఉన్నాయన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే షారూక్, ఆయన భార్య ఉగ్రవాద లింక్లు తెలిపే ఫోటోలు బయటకు రావడం సంచలనంగా మారింది. మరి, కేంద్ర ప్రభుత్వం ఈ బాలీవుడ్ సెలబ్రిటీలపై ఎటువంటి చర్యలు ఉంటాయనేది చర్చనీయాంశం అయింది.
Shah Rukh Khan couple links with ISI viral photos