Monday, April 29, 2024

అస్సాం నుంచి రాజ్యసభకు కేంద్ర మంత్రి సోనోవాల్ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Sonowal elected unopposed to Rajya Sabha from Assam

 

గువాహటి: కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ సోమవారం అస్సాం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ స్థానం కోసం పోటీలో ఉన్న ఏకైక అభ్యర్థి సోనోవాల్‌ను రాజ్యసభకు ఎన్నికైనట్లు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో రాజ్యసభలో అస్సాం నుంచి బిజెపి బలం మూడుకు పెరిగింది. బిజెపి మిత్రపక్షమైన అస్సాం గణపరిషద్(ఎజిసి) తరఫున ఒక సభ్యుడు రాజ్యసభలో ఉన్నారు. రాజ్యసభలో అస్సాం నుంచి మొత్తం ఏడు స్థానాలు ఉండగా రెండు స్థానాలలో కాంగ్రెస్, ఒక స్థానంలో ఇండిపెండెంట్ సభ్యులుగా ఉన్నారు. అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు భబేష్ కలితతో కలసి రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి నుంచి సోనోవాల్ ఎన్నికల ధ్రువీకరణ సర్టిఫికెట్ అందుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News