- Advertisement -
హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా సట్టా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.50,000 నగదు, మొబైల్ ఫోన్, మక్కా చిట్టీలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడ, సాయిబాబా నగర్కు చెందిన మహ్మద్ అహ్మద్ పాషా యాప్ల ద్వారా మక్కా నిర్వహిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుని మక్కా నిర్వహిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతడి ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -