Sunday, April 28, 2024

ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 72/7

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ మైదానంలో దక్షిణాఫ్రికా- ఇండియా మధ్య జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 72 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఎయిడెన్ మార్కమ్ ఒక్కడే 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కేశవ్ మహారాజ్ 24 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. బవుమా, రిలీ రోసో, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ బ్యాట్స్‌మెన్లు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో రబడా(0), కేశవ్ మహారాజ్(18) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా దీపక్ చామర్ రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర పటేల్, హర్షల్ పటేల్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News