- Advertisement -
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకుని నిషేధానికి గురైన భారత స్టార్ క్రికెటర్ శ్రీశాంత్కు పెద్ద ఊరట లభించింది. శ్రీశాంత్పై విధించిన నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనుంది. దీంతో అతన్ని తిరిగి కేరళ జట్టులో తీసుకునేందుకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం ఆసక్తి కనబరుస్తోంది.
ఫిట్నెస్ను నిరూపించుకుంటే శ్రీశాంత్ను కేరళ జట్టులో తీసుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రకటించింది. ఇదే విషయాన్ని శ్రీశాంత్కు కూడా చెప్పింది. దీంతో ఏడేళ్ల నిషేధం తర్వాత శ్రీశాంత్ మళ్లీ జాతీయ క్రికెట్లోకి వచ్చే అవకాశం లభించింది. తనపై నమ్మకం ఉంచిన కేరళ క్రికెట్ సంఘానికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా శ్రీశాంత్ ప్రకటించాడు. రానున్న రోజుల్లో పూర్తి ఫిట్నెస్ను సాధిస్తాననే ధీమాను శ్రీశాంత్ వ్యక్తం చేశాడు.
- Advertisement -