- Advertisement -
మనతెలంగాణ/తార్నాక: ఉస్మానియా యునివర్శిటి భూములపై రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నేతలు బుదవారం రిజిస్ట్రార్, ఓఎస్డిలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓయు భూములను కాపాడటానికి విద్యార్థి సంఘాలు ముందుంటాయన్నారు. ఎక్కడెక్కడ ఓయు భూములు ఉన్నాయో వాటిపై రీ సర్వే చేసి, ఓయు భూముల చుట్టూ ప్రహారి గోడను, సిసి కెమరాలను ఎర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, కాంపల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ విద్యార్ది విభాగం గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎంఎస్ఎఫ్ నాయకులు కొంగర శంకర్ మాదిగ, టిఎస్యు నాయకులు నల్గోండ్ అంజి, టిడివిపి నాయకులు కడారి సురేష్, టిజెఎస్ నాయకులు బాబు మహాజన్ తదితరులు పాల్గోన్నారు.
Student Committees demand for re-survey on OU’s Lands
- Advertisement -