- Advertisement -
అబుదాబి: సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 131 పరుగులు చేసి సన్రైజర్స్ హైదరాబాద్ కు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డివిలియర్స్ మెరుపు బ్యాటింగ్ తో 43 బంతుల్లో అర్థశతకం సాధించాడు. కీలక పోరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(6) మరోసారి నిరాశపరిచాడు. ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్(1), మొయిన్ అలీ(0), శివమ్ దూబే(8), వాషింగ్టన్ సుందర్(5) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. బెంగళూరును ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేయడంలో బౌలర్లు హోల్డర్(3/25), నటరాజన్ (2/33), కీలకంగా వ్యవహరించారు.
- Advertisement -