- Advertisement -
ముంబయి: అక్షయ్ కుమార్ తాజాగా నటించిన ‘సూర్యవంశీ’ బాక్సాఫీసు వద్ద హిట్టయింది. ఈ సినిమా డిజిటల్ ప్రిమీయర్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాత ఓటిటి ప్లాట్ఫామ్స్ల్లో చూయించాలన్న రూల్ను బ్రేక్ చేస్తూ సూర్యవంశీ చిత్రం ఒక నెల తర్వాత నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్నది. ఈ సినిమా డిజిటల్ ప్రిమీయర్ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ. 100 కోట్లకు కొనుకున్నట్లు తెలుస్తోంది. సూర్యవంశీ సినిమాలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. బుక్ మై షో యాప్ ద్వారా సెకనుకు అనేక టికెట్లు బుక్కవుతున్నాయని, ఇది వరకటి సినిమా బుకింగ్ రికార్డులను కూడా అధిగమించిందని తెలుస్తోంది.
- Advertisement -