Monday, April 29, 2024

మీడియా ముందు బోరుమన్న స్వప్న సురేశ్

- Advertisement -
- Advertisement -
Swapna Suresh
బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ జూన్ 11న కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ పాలక్కాడ్‌లో మీడియా ముందు విరుచుకుపడ్డారు.

పాలక్కాడ్(కేరళ): ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ దౌత్య సామాను కేసు ద్వారా బంగారం అక్రమ రవాణా చేసిన నిందితుల్లో ఒకరైన స్వప్న సురేశ్ జూన్ 11న పాలక్కాడ్‌లో మీడియా ముందు విరుచుకుపడింది. తన న్యాయవాది ఆర్. కృష్ణరాజ్ అరెస్టుపై ఆమె స్పందిస్తూ, తన కేసులో పోరాడేందుకు లాయర్లను మార్చే స్థోమత తనకు లేదని పేర్కొంది.

స్వప్న సురేశ్ విలేకరులతో మాట్లాడుతూ.. “వారు నాపై ఎందుకు ఇలా దాడి చేస్తున్నారు. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నాను. నా చుట్టూ ఉన్న వ్యక్తులను బాధపెట్టవద్దు. నన్ను బాధపెట్టండి, కావాలంటే నన్ను చంపేయండి, దాంతో   కథ ముగిసిపోతుంది” అని కన్నీళ్ళు పెట్టుకుంది.

కేరళ సిఎం పినరయి విజయన్ 2016లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి బ్యాగ్ నిండా కరెన్సీని తీసుకెళ్లారని చేసిన తన ఆరోపణ వెనుక “రాజకీయ లేదా వ్యక్తిగత ఎజెండా” ఏదీ లేదని స్వప్న  దీనికి ముందు బుధవారం తెలిపింది.

ఆమె వాంగ్మూలాన్ని అనుసరించి విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (VACB) బృందం బంగారు అక్రమ రవాణా కేసులో మరో నిందితుడు PS సరిత్‌ను పాలక్కాడ్‌లోని వారి ఫ్లాట్ నుండి అదుపులోకి తీసుకుంది. రెడ్ క్రెసెంట్ సహాయంతో అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ లైఫ్ మిషన్‌కు సంబంధించిన కేసులో VACB విచారణకు సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News