Monday, April 29, 2024

భారత్ నుంచి టి20 వరల్డ్‌కప్ తరలిపోయినట్టేనా?

- Advertisement -
- Advertisement -

T20 World Cup 2021 May be moved to UAE

ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ ఇక్కడి నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో ప్రపంచకప్‌ను కూడా యూఎఇకి తరలిచడమే మంచిదనే అభిప్రాయానికి భారత క్రికెట్ బోర్డు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై బిసిసిఐ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. పరిస్థితులను గమనిస్తే భారత్‌లో ప్రపంచకప్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్‌పై విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. అంతేగాక భారత్‌తో సంబంధాలను తాత్కాలికంగా తెంచుకున్నాయి. ఇలాంటి స్థితిలో విదేశీ జట్ల క్రికెటర్లు భారత్‌కు రావడం కష్టంగా మారింది. దీంతో భారత్‌లో ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు నెలకొంది. ఈ పరిస్థితుల్లో వరల్డ్‌కప్‌ను యూఎఇకి తరలించడమే మంచిదని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

T20 World Cup 2021 May be moved to UAE

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News