Monday, April 29, 2024

నేడు టిడిపి-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం  టిడిపి-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల తర్వాత జాబితాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ లు ఉమ్మడి అభ్యర్థుల పేర్లను విడుదల చేయనున్నారు. చంద్రబాబు, పవన్‌ 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. 50కు పైగా టిడిపి, 10కి పైగా జనసేన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇబ్బందులు లేని స్థానాలలో అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నట్టు సమాచారం. జాబితాలో కుప్పంలో చంద్రబాబు నాయుడు, బీమవరంలో పవన్ కల్యాణ్, టెక్కలిలో అచ్చెన్నాయుడు, మంగళగిరిలో నారా లోకేష్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ పేర్లు ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News