Monday, April 29, 2024

తల్లి, సోదరుడిని చంపి…. బాయ్ ఫ్రెండ్ తో పోర్టుబ్లెయిర్ కు వెళ్లిన టెక్కీ

- Advertisement -
- Advertisement -

Murder

 

బెంగళూరు: టెక్కీ తన తల్లి, సోదరుడిని చంపి అనంతరం బాయ్ ఫ్రెండ్ తో కలిసి పోర్టుబ్లెయిర్‌కు వెళ్లిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  అమృత చంద్రశేఖర్ అనే టెక్కీ తన తల్లి నిర్మల, సోదరుడు హరీష్ తో కలిసి ఆర్ కె పురమ్ లో నివసిస్తోంది. అంతే కాకుండా ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో తిరగడం తన తల్లి,  సోదరుడికి ఇష్టం లేదు. దీంతో ఆమెను పలుమార్లు తల్లి, సోదరుడు మందలించడంతో వాళ్లపై పగపెంచుకుంది. శనివారం రెండు విమాన టిక్కెట్లను హైదరాబాద్ కు వెళ్లడానికి బుక్ చేసింది. ముగ్గురు కలిసి శనివారం రాత్రి డిన్నర్ చేశారు. ఆదివారం వేకువజామున ఇంట్లో నుంచి శబ్ధాలు రావడంతో ఏం జరుగుతోందని హరీష్ తన అమృతను అడిగాడు. మనం హైదరాబాద్ వెళ్తున్నాము కదా అమ్మ లగేజీ సర్దుతుందని  ఆమె జవాబిచ్చింది. అనంతరం కత్తితో తీసుకొని సోదరుడు రూమ్ లోకి వెళ్లి దాడి చేయబోయింది. అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే అతడిని కత్తితో పొడిచింది… అతడు అమ్మ అమ్మ అని కేకలు వేయడంతో అప్పటికే అమ్మని చంపేశానని చెప్పి అతడికి చెప్పి వెళ్లింది. క వెంటనే తన బాయ్ ఫ్రెండ్ తో  బైక్ పై వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని హరీష్ ను ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  వాళ్ల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్లు పోర్టుబ్లెయర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే వాళ్లను ఇక్కడికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News