Monday, April 29, 2024

తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Telangana corona cases today
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు దుర్మరణం చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు సంఖ్య 2.92 లక్షలకు చేరుకోగా 1583 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.86 లక్షల మంది కోలుకోగా 3919 మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 75.42 లక్షల మంది కరోనా పరీక్షలు చేశారు. కరోనా కేసుల సంఖ్యలో తెలంగాణ 12 వస్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ (8.86 లక్షలు) మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మహారాష్ట్ర (19.94 లక్షలు), రెండో స్థానంలో కర్నాటక(9.33 లక్షలు) ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News