Monday, April 29, 2024

హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా బుధవారం (జూన్ 7) రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి దినోత్సవం (వాటర్ డే) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఈ పథకం పూర్తయితే సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలను సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకానికి కాళేశ్వరం నుంచి 12 టిఎంసిల నీటిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టుపై మంత్రి హరీష్ రావు ఓ ట్వీట్ చేశారు. నాడు ఎటు చూసినా తడారిన నేలలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఓ కవిత తరహాలో ట్వీట్ చేశారు.
“నాడు ఎటు చూసినా తడారిన నేలలు..
నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి.
నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు..
నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు.
ఇది తెలంగాణ జలవిజయం..
కేసీఆర్ సాధించిన ఘన విజయం.
మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు..
ఊటలు జాలువారుతున్న వాగులు..
పాతళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదృశ్యాలు.
ఇది కదా జల తెలంగాణ..
ఇది కదా కోటి రతనాల మాగాణ.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
హృదయ పూర్వక శుభాకాంక్షలు” అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News