- Advertisement -
హైదరాబాద్: కల్యాణలక్ష్మిపథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబందించి రూ.337.50 కోట్ల రూపాయలను బిసి సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతలు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకానికి బడ్జెట్ నుంచి రూ.675 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా 337.50 కోట్లు విడుదల చేయగా.. నాలుగో త్రైమాసికానికి సంబంధించిన మరో 337.50 కోట్లు కేటాయింపులు ఉన్నాయి.
Telangana Govt Released Kalyana Lakshmi Budget
- Advertisement -