Monday, April 29, 2024

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి..

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి సతీష్ అనే టెంట్ హౌస్ కార్మికుడు మృతి చెందాడు. అమ్మవారి ఆలయంలో క్యూలైన్ కు సంబంధించిన సామాగ్రిని తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆలయ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పాయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tent House worker died as electric shock at Indrakeeladri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News