Thursday, May 9, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Terrible road accident in UP

నలుగురు మహిళలతోసహా, ఐదుగురి మృతి

ష్రవస్తి(యుపి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ష్రవస్తి జిల్లా బుద్ధ సర్క్యూట్ ప్రాంతంలో ఇటుకలతో వెళుతున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని టెంపో బోల్తా కొట్టగా మరో ట్రక్కు దానిపై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలతోసహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. శుక్రవారం రాత్రి ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని ఉత్రోలాకు చెందిన 9 మంది టెంపోలో బహ్రాయిచ్‌లోని దర్గామ్ షరీఫ్‌కి వెళ్లి తిరిగివస్తుండగా నారాయణపూర్ గ్రామంలో ఆగి ఉన్న ఒక ట్రాక్టర్ ట్రాలీని టెంపో ఢీకొని బోల్తాపడింది. టెంపోలోని ప్రయాణికులందరూ కింద పడిపోగా వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని జిల్లా ఎస్‌పి అరవింద్ కుమార్ మౌర్య శనివారం తెలిపారు. ఐదుగురు ప్రయాణికులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బహ్రాయిచ్‌లోని వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News